ASIAN GAMES: చరిత్ర సృష్టించిన భారత్… మ్యాచ్ రద్దు రయినా గోల్డ్ మెడల్ !

-

ఈ రోజు ఆసియన్స్ గేమ్స్ లో భాగంగా జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు ఆరంభంలో ఇండియా బౌలర్ల దెబ్బకు పరుగులు చేయడానికి నానా తిప్పలు పడింది. అలా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఇన్నింగ్స్ 18 .2 ఓవర్ ల వద్ద ఉండగా భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను జరిపే అవకాశం లేకపోవడంతో రెడ్డి అయినట్లు ఆసియన్ గేమ్స్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ కారణంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఇండియా జట్టును విజేతగా ప్రకటించి గోల్డ్ మెడల్ ను బహూకరించారు. ఈ గోల్డ్ మెడల్ తో ఆసియన్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశ పెట్టిన అనంతరం గోల్డ్ మెడల్ ను సాధించిన మొదటి జట్టుగా ఇండియా చరిత్రను సృష్టించింది.

ఇక ఆఫ్గనిస్తాన్ రన్నర్ అప్ గా నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకుంది. ఇక మూడవ స్థానంలో ఉదయం జరిగిన పోరులో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ను చిత్తు చేసి రజత పథకాన్ని కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version