దంచికొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు.. ఇండియా టార్గెట్ 297

-

సౌతాఫ్రికా, ఇండియా మ‌ధ్య‌ జరుగుతున్న మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. భాత‌ర బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటు సుల‌వుగా బౌండ‌రీలు బాదారు. దీంతో సౌత్ ఆఫ్రికా నిర్ణిత 50 ఓవ‌ర్ల‌లో 296 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ఈ వ‌న్డే లో విజ‌యం సాధించాలంటే 297 ప‌రుగులు రాబ‌ట్టాలి. కాగ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు ఇద్ద‌రు సెంచ‌రీ న‌మోదు చేశారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా 110 (143) ప‌రుగుల‌ను 8 ఫోర్లు తో కొట్టాడు.

అలాగే రాస్సి వాన్ డెర్ డ‌స్సెన్ కేవ‌లం 96 బంతుల్లో 129 ప‌రుగులు చేశాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో డ‌స్సెన్ 9 ఫోర్లు, 4 సిక్స్ ల‌ను కూడా బాదాడు. ఈ ఇద్ద‌రి బ్యాటింగ్ ల‌కు భార‌త బౌల‌ర్లు చేతులెత్తేశారు. నాలుగో వికెట్ కు బావుమా, డ‌స్సెన్ లు ఏకంగా 204 ప‌రుగుల‌ను జోడించి సౌత్ ఆఫ్రికా భారీ స్కోరు కార‌ణం అయ్యారు. శార్ధుల్ ఠాకూర్ త‌న 10 ఓవ‌ర్ల‌లో ఏకంగా 72 ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. అలాగే భూవ‌నేశ్వ‌ర్ కూడా 10 ఓవ‌ర్ల‌లో 64 ప‌రుగుల‌ను ఇచ్చాడు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. స్పిన్న‌ర్ ర‌వీచంద్ర‌న్ అశ్విన్ ఒక వికెట్ ప‌డగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news