IND vs WI: వెస్టిండీస్ పర్యటనకు కెప్టెన్ గా శిఖర్ ధావన్

-

వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు శిఖర్ ధావన్ కు దక్కాయి. ఊహించినట్లుగానే ఈ పర్యటనలో జట్టు కీలక సీనియర్, మల్టీ – ఫార్మాట్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. ఈ సందర్భంలో శుబమన్ గిల్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీనియర్ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల సిరీస్ కు సంబంధించిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..

శిఖర్ ధావన్( కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శార్దుల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news