CSK vs KKR : ధోని మెరుపు ఇన్నింగ్స్.. కోల్‌క‌త్త టార్గెట్ 132

-

ఐపీఎల్ 2022 ధోని మెరుపు ఇన్నింగ్స్ తో ప్రారంభం అయింది. నేడు ఈ సీజ‌న్ లో తొలి మ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగ‌న మ్యాచ్ లో ఎంఎస్ ధోని వీర విహారం చేశారు. అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో క‌ష్ట కాలంలో ఉన్న చెన్నై జ‌ట్టును ఆదుకున్నాడు. కేవ‌లం 38 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ 24వ అర్థ శ‌త‌కాన్ని ధోని పూర్తి చేసుకున్నాడు. కాగ ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్‌క‌త్త.. మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో జ‌డేజా సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. తొలి మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్ మెన్లు చేతులేత్తాశారు. ఓపెన‌ర్లు రుతురాజ్ గైక్వాడ్ (0) తో నిరాశ‌ప‌ర్చాడు. అలాగే డెవాన్ కాన్వే (3) విఫ‌లం అయ్యాడు. ఉత్త‌ప్ప (28) ప‌ర్వ‌లేద‌నిపించాడు. అంబ‌టి రాయుడు (15), దూబే (3) రాణించ‌లేక పోయారు.

చెన్నై క‌ష్ట కాలంలో ఉన్న స‌మ‌యంలో ధోని ( 50 ) – జ‌డేజా ( 26) అద్భ‌త‌మైన ఇన్నింగ్స్ ఆడారు. వీరు ఇద్ద‌రు క‌లిసి చివ‌ర్లో 57 బంతుల్లోనే 70 ప‌రుగ‌ల‌ను రాబ‌ట్టారు. దీంతో చెన్నై గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో చెన్నై ఐదు వికెట్ల‌ను కోల్పోయి.. 131 ప‌రుగులు చేసింది. కాగ ఈ తొలి మ్యాచ్ లో కోల్‌కత్త నెగ్గాలంటే.. 132 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news