గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్  మ్యాచ్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(16), ట్రావీస్ హెడ్ (19) విఫలం చెందారు. అబ్దుల్ సమద్ (29), అభిషేక్ (29), క్లాసెన్ (24) పర్వాలేదనిపించారు. మాక్రామ్ (17) మినహా మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు.

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు, ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ తలో వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 163 పరుగులు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఛేదిస్తుందో.. లేదో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news