ఐపీఎల్ 2023 : కీలక పోరులో “ఢిల్లీ” బ్యాటింగ్… వార్నర్ ఏమి చేస్తాడో సామీ !

-

ఐపీఎల్ లో ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కోర్ బోర్డు మీద ఎక్కువ పరుగులు పెట్టి ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచడమే తన స్ట్రాటజీ అని టాస్ తర్వాత చెప్పాడు కూడా , కాగా ఈ రోజు టీం లో కూడా చాలా మార్పులను చేశాడు. గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో సౌత్ ఆఫ్రికా చిచ్చర పిడుగు రిలీ రసౌ జట్టులోకి వచ్చాడు. ఇక యువ ఆటగాడు ప్రియం గార్గ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంతవరకు ఫిలిప్ సాల్ట్ కొన్ని మ్యాచ్ లలో అవకాశం దక్కించుకున్నప్పటికీ ఎందుకో తన స్టామినాను నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

 

ఇక ఆలస్యం చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆప్స్ కు కూడా వెళ్లకుండా ఇంటి దారి పడుతుంది. మరి మార్పులు చేసిన ఈ ఆటగాళ్లతో కెప్టెన్ వార్నర్ ఏమైనా మాయ చేసి మళ్ళీ ఢిల్లీని గెలుపు బాటలో పయనించేలా చేస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news