ఐపిఎల్ 2023: ఢిల్లీ చేతిలో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు… !

-

ధర్మశాలలో పంజాబ్ మరియు ఢిల్లీ ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది, ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచినా ఓడిపోయినా పరిగణలోకి రాదు. ఇప్పటికే ఐపీఎల్ లో సరైన ప్రదర్శన చేయని కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు టోర్నీ నుండి ప్లే ఆఫ్ దశకు చేరుకోకుండానే నిష్క్రమించాయి. ఇప్పుడు మిగిలిన ఎనిమిది టీం ల మధ్యన ప్లే ఆఫ్ యుద్ధం జరుగుతోంది. కాగా మొన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలవడంతో ప్లే ఆఫ్ కు చేరిన మొదటి టీం గా ఘనతను అందుకుంది. కాగా వరుసలో మూడు జట్లు ప్లే ఆఫ్ కు చేరాల్సి ఉండగా…. ఈ వీక్ లో జరగనున్న మ్యాచ్ ఫలితాలతో అవి తేలిపోనున్నాయి. కాగా క్రికెట్ విశ్లేషకులు అనుకుంటున్న ప్రకారం గుజరాత్ తో పాటుగా , చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ లు పక్కాగా చేరుతాయని ఊహిస్తున్నారు.

నాలుగవ జట్టు విషయంలో కాస్త గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది, పంజాబ్ , బెంగుళూరు మరియు ముంబై లలో ఒక జట్టు నాలుగవ జట్టుగా ప్లే ఆఫ్ లో అడుగుపెట్టనున్నాయి. మరి ప్రస్తుతానికి అయితే పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు లేనట్లే.

Read more RELATED
Recommended to you

Latest news