ఐపీఎల్ ట్రోఫీ మ‌ళ్లీ ముంబైదే.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం..

-

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొంది మ‌రో ఐపీఎల్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ విజ‌యంలో ఐపీఎల్‌లో ఏకంగా 5 సార్లు ట్రోఫీ సాధించిన జ‌ట్టుగా ముంబై రికార్డు సృష్టించింది.

mumbai indians lift ipl trophy once again

మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 65 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, రిష‌బ్ పంత్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 56 ప‌రుగులు చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కోల్ట‌ర్‌నైల్‌కు 2 వికెట్లు ద‌క్క‌గా, యాద‌వ్‌కు మ‌రొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబై 18.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగులు చేయ‌గా, ఇషాన్ కిష‌న్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నోర్జె 2 వికెట్లు తీయ‌గా, ర‌బాడా, స్టాయినిస్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news