IPL 2022 : లక్నోపై విక్టరీ..ప్లేఆఫ్ బెర్త్ ఫైనల్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్..!

-

క్రూషియల్‌ మ్యాచ్‌ లో లక్నో పై 24 పరుగుల తేడాతో రాజస్థాన్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులకే చేయగలిగింది. దీపక్‌ హుడా 59 పరుగుల చేసి.. రాణించాడు. కృనాల్‌ పాండ్య 25 పరుగులు, స్టొయినీస్‌ 27 పరుగులు చేసి.. జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు.

ఇక మిగతా బ్యాటర్లు డికాక్‌ 7 పరుగులు, రాహుల్‌ 10 పరుగులు ఆయూష్‌ బదోని డకౌట్‌, జాసన్‌ హోల్డర్‌ 1 పరుగు, మోహీసిన్‌ ఖాన్‌ 9 పరుగులు చేసి.. ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్‌ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ 2, మెక్‌ కాయ్‌ 2, చాహల్, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు.

ఈ విజయంతో రాజస్థాన్‌ 16 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. రన్‌ రేట్‌ తగ్గడంతో లక్నో మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలన జట్ల మ్యాచ్‌ లల్లో అద్భుతాలు జరిగితే తప్పితే.. ఈ రెండు టీంలు దాదాపు ప్లే ఆఫ్స్‌ కు చేరుకున్నట్లే. ఇక నాలుగో స్థానానికి ఏ జట్లు చేరుతుందో తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news