క్రికెట్: రోహిత్ ఆ తప్పు చేయకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.. వీవీఎస్ లక్ష్మణ్.

-

ఇంగ్లండుతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచు నాటింగ్ హామ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్, 183పరుగులకే కుప్పకూలింది. ఐతే రెండోరోజు ఆట కొనసాగించిన భారత జట్టు ఆరంభంలో చక్కని ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్ కు 97పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐతే సడెన్ గా రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత 112పరుగులకే 4వికెట్లు కోల్పోయింది.

15పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. ఔటవడానికి ముందు రోహిత్ శర్మ వికెట్ల మధ్య తడబడ్డాడు. లాంగ్ షాట్ కొట్టే పనిలో వికెట్ల మధ్య పరుగులో రనౌట్ మిస్సయ్యాడు. బహుశా అలా జరగడం వల్ల అతను కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉంటాడని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సాధారణంగా రోహిత్ ఆడే లాంగ్ షాట్లు గాల్లో కలిసేవి. కానీ ఇక్కడ అలా జరగలేదు. దాంతో కన్ఫ్యూజన్ లోకి దిగిన రోహిత్ శర్మ, ఒత్తిడి లోనై వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news