DHONI LIVE: నేడు మధ్యాహ్నం అభిమానులకు ధోని శుభవార్త

-

జార్ఖండ్ డైనమైట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు నేడు మధ్యాహ్నం శుభవార్త చెప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి సర్ప్రైజ్ ను ధోని రివిల్ చేయనున్నాడు. ఈనెల 25న లైవ్ లోకి వస్తానని చెప్పి అభిమానులను సందేహంలోకి నెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. దీంతో ధోని చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే సాధారణంగా ధోని సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే ఆక్టివ్ గా ఉంటాడు. ఇప్పుడు సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి శుభవార్త చెప్తాను అనడంతో మహి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు నేటిజెన్లు ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెబుతాడనే కామెంట్లు చేస్తున్నారు. అయితే ధోని చెప్పబోయే ఆ విషయం ఏంటో అన్న ఆసక్తి నెలకొంది. క్రికెట్ పై చెప్పబోతారా.. లేక వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news