వరల్డ్ ఛాంపియన్స్ వచ్చేశారు.. దిల్లీ ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్ కమ్

-

T20 వరల్డ్ కప్ విన్నర్గా నిలిచిన టీమ్ ఇండియా మూడ్రోజుల తర్వాత భారత్ చేరుకుంది. ఈనెల 29వ తేదీన జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్‌ సేన ఈరోజు ఉదయం దిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకుంది. వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ప్లేయర్ల రాకతో ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. ‘భారత్ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ నినాదాలతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ప్లేయర్లంతా దిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. అక్కడ హోటల్ యాజమాన్యం కూడా ప్లేయర్లకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. చాక్లెట్ ఫ్లేవర్తో వరల్డ్కప్ ట్రోఫీ డిజైన్లో ప్రత్యేకంగా కేక్ తయారు చేశారు. ఇక్కడ నుంచి రోహిత్‌ సేన ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన నివాసంలో కలవనున్నారు. ఆ తర్వాత భారత క్రికెట్‌ జట్టు సభ్యులు ముంబయికి బయలుదేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news