IPL 2024: ముంబైకి మరో షాక్.. ఆటగాళ్లందరికీ ఫైన్

-

Hardik Pandya and other Mumbai Indians players :  ఓటమి బాధలో ఉన్న ముంబైకి మరో షాక్.. ఆటగాళ్లందరికీ ఫైన్ వేసింది బీసీసీఐ పాలక మండలి. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ పడింది. లక్నో సూపర్ జేయింట్స్ తో మ్యాచ్ లో నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ‘స్లో ఓవర్ రేట్’ కింద కెప్టెన్ పాండ్యాకు రూ. 24 లక్షలు జరిమానా పడింది.

Hardik Pandya and other Mumbai Indians players fined in lakhs for offence against Lucknow

జట్టు ఆటగాళ్లకు సైతం 25% మ్యాచ్ ఫీజు లేదా రూ. 6 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్ లో పాండ్యాకు ఇది రెండో ఫైన్. మరోసారి ఇలాగే జరిగితే మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. కాగా LSGతో మ్యాచ్ లో ముంబై ఓడిన విషయం తెలిసిందే.

కాగా లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో లక్నో ప్లేయర్ బదోని రన్ అవుట్ పై సోషల్ మీడియాలో వివాదం కొనసాగుతోంది. క్రేజ్ లోకి వచ్చాక కూడా థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో బ్యాట్ గాల్లో ఉండటంతో అవుట్ ఇచ్చారని చెబుతున్నారు. ఏదేమైనా ఎంపైర్లు ఎప్పుడూ ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news