యంగ్ ఇండియన్ పవర్: కిల్లింగ్ “ఇషాన్ కిషన్” హ్యాట్రిక్ హాఫ్ సెంచరీస్ !

-

ఈ రోజు ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన జరుగుతున్న మూడవ వన్ డే లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఓపెనర్లు కుదురుగా ఆడుతున్నారు. సిరీస్ ను గెలుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా భారీ స్కోర్ చేస్తేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు, లేదంటే గత మ్యాచ్ లాంటి ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఓపెనర్ లుగా వచ్చిన ఇషాన్ కిషన్ మరియు శుబ్మాన్ గిల్ లు ఆచితూచి ఆడుతూ భారీ స్కోర్ కు గట్టి పునాది వేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ ఇండియన్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఈ సిరీస్ లో మరో అర్ద సెంచరీ ని సాధించాడు. మొదటి మరియు రెండవ మ్యాచ్ లలోనూ అర్ద సెంచరీ లు సాధించిన ఇషాన్ కిసన్ ఆ తర్వాత పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా దక్కిన మంచి స్టార్టింగ్ ను భారీ స్కోర్ గా మలుచుకుంటాడా లేదా అంది తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం ఇండియా 16 ఓవర్ల అనంతరం 116 పరుగులు చేసి నిలకడగా ఆడుతోంది. ఇషాన్ కిషన్ 58 పరుగులు మరియు శుబ్మాన్ గిల్ 47 పరుగులతో ఆడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news