విజ‌యానికి చేరువ అవుతున్న భార‌త్‌..

-

ఫ్రీడమ్‌ ట్రోఫీ తొలి టెస్టు చివరి రోజుకు చేరింది. మ్యాచ్‌లో గెలుపుపై భారత్‌ దృష్టి పెట్టగా, దక్షిణాఫ్రికా కనీసం ‘డ్రా’ను ఆశిస్తోంది. దక్షిణాఫ్రికాతో వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అగ్రశ్రేణి స్పిన్నర్ రవీంద్ర జడేజా వరుస వికెట్లతో చెలరేగిపోతున్నాడు. 395 పరుగుల ఛేదనలో భాగంగా ఆటలో ఆఖరి రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 11/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా.. రవీంద్ర జడేజా దెబ్బకి 70/8తో నిలిచింది.

తొలి సెషన్‌.. ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన జడేజా.. ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లని పడగొట్టడంతో సఫారీల ఓటమి ఖాయమైంది. భారత బౌలర్లలో మహ్మాద్ షమీ మూడు వికెట్లు, జడేజా రెండు వికెట్లు తీశారు. మార్క్రామ్, డు ప్లెసిస్, డికాక్, కేశవ్ మహారాజ్, ఫిలాండర్ వెంటవెంటనే ఔటవ్వడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక విజయానికి భారత జట్టు మరో రెండు వికెట్లు దూరంలో నిలించింది.

Read more RELATED
Recommended to you

Latest news