ఒలింపిక్స్ : కెప్టెన్ అదుర్స్.. ఇండియా విక్టరీ..!

-

ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు మరి విజయం అందుకుంది. ఈసారి కఠినమైన గ్రూప్ లో పడిన టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చివరి నిమిషంలో మూడో గోల్ వేసి విజయం అందుకున్న భారత జట్టు.. నిన్న అర్జెంటీనాపై కూడా చివరి రెండు నిమిషాల్లో గోల్ చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది.

ఇక ఈరోజు ఐర్లాండ్ పై మాత్రం సునాయాస విజయం అందుకుంది అనే చెప్పాలి. మ్యాచ్ ప్రారంభమైన ఆరు నిమిషాల్లోనే కెప్టెన్ హర్మాన్ప్రీత్ సింగ్ గోల్.. చేయగా.. 13 వ నిమిషంలో కెప్టెన్ రెండో గోల్ వేసాడు. దాంతో చివరి వరకు 2-0 లిడ్ ను కాపాడుకుంటూ వచ్చిన భారత్ ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా విజయం అందుకుంది. ఇక ఈరోజు చేసిన రెండు గోల్స్ తో భారత కెప్టెన్ 2024 ఒలంపిక్స్ లో మొత్తం 4 గోల్స్ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version