పుణె టెస్ట్‌లో భారత్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం

-

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఫాలోఆన్ ఆడిన సఫారీలు మూడో సెషన్ ఆరంభంలోనే 189 పరుగులకి ఆలౌటయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్సులో 275 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్సులోనూ సఫారీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలను ఆదిలోనే ఇషాంత్ శర్మ దారుణంగా దెబ్బతీశాడు. ఓపెనర్‌ మార్‌క్రామ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. ఈరోజు సఫారీలను ఫాలోఆన్ ఆడించి.. వారిని 189 పరుగులకే కుప్పకూల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news