Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

-

ఒడిశా లోని రూర్కెలాలో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్-డి లో భాగంగా స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 2-0 తో విజయం సాధించింది. తోలుత నెమ్మదిగా మ్యాచ్ ను ప్రారంభించిన భారత జట్టు ఆ తర్వాత ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది.

11 వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ తర్వాత దక్కిన మరో పెనాల్టీ కార్నర్ ను టీమిండియా సద్వినియోగం చేసుకుంది. అమిత్ రోహిదాస్ వేగంగా స్పందించి మెరుపు వేగంతో బంతిని గోల్డ్ పోస్టులోకి పంపి భారత్ ఖాతా తెరిచాడు.

 

ఆ తర్వాత హార్దిక్ సింగ్ గోల్ పోస్టు సమీపంలో బంతిని పాస్ చేశాడు. అది ప్రత్యర్థి ఆటగాడి స్టిక్ కు తగిలి గోల్ పోస్టులోకి వెళ్లడంతో భారత్ ఆదిక్యం 2-0 కి పెరిగింది. మూడో క్వాటర్ లో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంలో భారత్ విఫలమైంది. ఇంకోవైపు, గోల్స్ కోసం స్పెయిన్ తీవ్రంగా పోరాడిన భారత డిఫెన్స్ ఆటగాళ్లు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇండియా గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news