టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంపిక..!

-

వన్డే ప్రపంచ కప్ లో ఇవాళహై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. అయితే ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరునుంది. వరుసగా రెండు విజయాలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇవాళ రెండు జట్లు కూడా హ్యాట్రిక్ పై కన్నేశాయి. ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై భారత్ ఏడుసార్లు విజయం సాధించింది. ఇప్పుడు ఆధిక్యతను 8కి చేర్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాస్ ను భారత్ గెలిచింది. భారత్ తొలుత  ఫీల్డింగ్ ను ఎంచుకుంది. టీమిండియా ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమైంది.  శుభమన్ గిల్ టీమిండియా జట్టులోకి వచ్చాడు. 

 భారత్ జట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. 

పాకిస్తాన్ జట్టు : బాబర్ ఆజం (కెప్టెన్), అబ్దుల్లా షపీక్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్),  సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అప్రిదీ, హరీస్ రవూఫ్, 

Read more RELATED
Recommended to you

Latest news