భార‌త్‌, పాక్ మ్యాచ్‌.. ఇండియా గెల‌వాల‌ని అభిమానుల పూజ‌లు..

-

నేడు మాంచెస్ట‌ర్‌లో భార‌త్‌, పాక్‌ల మ్యాచ్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలియ‌డంతో టీమిండియా అభిమానులు వ‌ర్షం ప‌డ‌కూడ‌ద‌ని చెప్పి హోమాలు చేస్తున్నారు.

మ‌రో గంట‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే టోర్నీలో ఓట‌మి అంటూ ఎరుగ‌ని భార‌త్ మ‌రో మ్యాచ్‌లో విజ‌యం కోసం సిద్ధ‌మ‌వుతుండ‌గా, అస్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాక్ త‌డ‌బ‌డుతూ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. అయితే నేడు భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య మాంచెస్ట‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు కూడా వ‌ర్షం అడ్డంకిగా మారుతుంద‌ని తెలుస్తుండ‌డంతో.. టీమిండియా క్రికెట్ అభిమానులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

నేడు మాంచెస్ట‌ర్‌లో భార‌త్‌, పాక్‌ల మ్యాచ్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలియ‌డంతో టీమిండియా అభిమానులు వ‌ర్షం ప‌డ‌కూడ‌ద‌ని చెప్పి హోమాలు చేస్తున్నారు. భార‌త జెండాతోపాటు టీమిండియా ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి, మ‌హేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శ‌ర్మ‌ల ఫొటోల‌ను ఉంచి అభిమానులు హోమం, పూజ‌లు చేస్తున్నారు. వ‌ర్షం ప‌డ‌కుండా చూడాల‌ని దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఈ ఒక్క రోజుకు వ‌రుణ దేవున్ని శాంతించాల‌ని, మ్యాచ్‌కు ఆటంకం క‌లిగించకుండా దూరంగా వెళ్లాల‌ని కోరుతున్నారు. అలాగే మ్యాచ్‌లో ఇండియా గెల‌వాల‌ని కూడా అభిమానులు త‌మ ఇష్ట దైవాల‌ను ప్రార్థిస్తున్నారు. కాగా భార‌త అభిమానులు పూజ‌లు చేస్తున్న ఆ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిని నెటిజ‌న్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news