టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌..

-

లండ‌న్‌లోని మాంచెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో ఇవాళ జ‌రగ‌నున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 22వ మ్యాచ్‌లో పాకిస్థాన్ భార‌త్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా అనుకున్న‌ట్లుగానే టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకుంది. ఈ క్ర‌మంలో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన‌ప్ప‌టికీ ధాటిగా ఆడి ప‌రుగులు బాగా చేస్తే మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ సంద‌ర్భంగా తెలిపాడు. ఇక రెండు జ‌ట్లకు చెందిన ప్లేయ‌ర్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

భార‌త్‌: రోహిత్ శ‌ర్మ‌, లోకేష్ రాహుల్‌, విరాట్ కోహ్లి (కెప్టెన్‌), విజ‌య్ శంక‌ర్‌, ఎంఎస్ ధోనీ (వికెట్ కీప‌ర్‌), కేదార్ జాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, కుల్దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, జ‌స్‌ప్రిత్ బుమ్రా.

పాకిస్థాన్‌: ఇమామ్ ఉల్ హ‌క్‌, ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, బాబం ఆజం, మ‌హ‌మ్మ‌ద్ హ‌ఫీజ్‌, స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ (కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌), షోయ‌బ్ మాలిక్‌, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్‌, హ‌స‌న్ అలీ, వ‌హ‌బ్ రియాజ్‌, మ‌హ‌మ్మ‌ద్ అమీర్‌.

Read more RELATED
Recommended to you

Latest news