India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

-

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత జట్టు జాతీయ గీతం అలపిస్తుండగా కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా కిషన్ ఉలిక్కిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో అతడికి ఎటువంటి హాని జరగలేదు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గత కొన్ని సిరీస్ ల నుంచి కేవలం బెంచ్ కె పరిమితం అవుతున్న కిషన్ కు ఈ మ్యాచ్ కు భారత తుది జట్టులో చోటు దక్కింది. కాగా ఇటీవల కాలంలో స్టేడియాల్లో ఆటగాళ్లపై తేనెటీగ దాడులు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన తొలి వన్డేలో పాక్ బ్యాటర్ ఫకర్ జమన్ కూడా తేనెటీగల దాడికి గురయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news