వైరల్ వీడియో: లక్కీ క్రికెట్ ఫ్యాన్

-

ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యుఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు వేదికల్లో ఐపిఎల్ జరుగుతుంది. 3 స్థానాల్లో షార్జా క్రికెట్ స్టేడియం అతిచిన్న వేదిక. దీనితో ఎవరైనా సిక్స్ కొడితే బంతి స్టేడియం బయట ఉన్న ప్రధాన రహదారి మీద పడుతుంది. దీనితో ఆ బంతి కోసం అభిమానులు బయట వెయిట్ చేస్తున్నారు. ఐపిఎల్ 2020లో 34 వ మ్యాచ్ ఢిల్లీ, కేపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది.

జడేజా సిక్స్ కొట్టగా ఒక బంతి స్టేడియం బయట పడింది. ఆ బంతి కోసం అభిమాని ఒకరు ట్రాఫిక్ దాటుకుని వచ్చి పట్టుకుని పారిపోయాడు. అక్కడ ఉన్న కెమెరాల్లో ఈ వీడియో రికార్డ్ అయింది. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CGcy3dylS7H/?utm_source=ig_embed

Read more RELATED
Recommended to you

Latest news