కోహ్లీని కించపరిచేలా ఐసీసీ పోస్ట్.. భగ్గుమంటున్న కోహ్లీ అభిమానులు!

-

ICC తీరుపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంకోసారి గనుక ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే మీ సోషల్ మీడియా అకౌంటును అన్ ఫాలో చేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. t20 వరల్డ్ కప్ 2022 నేపథ్యంలో ఐసిసి ఇన్ స్టా వేదికగా పలు వీడియోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, “ఇండియా సిద్ధంగా ఉందా? అంటూ ఓ షార్ట్ వీడియోను పంచుకుంది.

అయితే, ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ సహా సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, యజువేంద్ర చాహాల్ మాత్రమే కనిపించారు. మరో వీడియోలో రాహుల్, రోహిత్, సూర్య, చాహల్, అక్షర్ పటేల్, అశ్విన్, దినేష్ కార్తీక్ తదితరులు మాత్రమే ఉన్నారు. దీంతో కింగ్ కోహ్లీ రాక కోసం ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయింది. అదే ఐసీసీ పై వారి ఆగ్రహానికి కారణమైంది. “కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అతడు లేకుండా టీమిండియా ప్రోమోనా? అసలు ఏమనుకుంటున్నారు? కోహ్లీ వస్తాడని ఎంతగానో ఎదురు చూసాం. కానీ మమ్మల్ని పూర్తిగా నిరాశ పరిచారు” అంటూ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news