ఒలింపిక్స్ : క్వాటర్స్ లో ఓడిన భారత రెజ్లర్..!

-

ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. రెజ్లింగ్ లో పోటీలో మిగిలి ఉన్న రితిక హుడా కూడా ఇప్పుడు క్వాటర్ ఫైనల్స్ లో ఓడిపోయింది. రౌండ్ 16 లో అష్బుత ప్రదర్శన కనబర్చిన రితిక.. ఇక్కడ కూడా మంచి పోటీనే ఇచ్చింది. అయినా కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

కిరిగిస్థాన్ రెజ్లర్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి రౌండ్ లో ఒక్క పాయింట్ సాధించిన రితిక ప్రత్యర్థికి పాయింట్స్ ఇవ్వలేదు. కానీ రెండో రౌండ్ లో కిరిగిస్థాన్ రెజ్లర్ కూడా ఓ పాయింట్ స్కోర్ చేసింది. దాంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఇద్దరు రెజ్లర్లు ఒక్కో పాయింట్ స్కోర్ చేసారు. అయితే ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో ఇలా స్కోర్స్ సమం అయినప్పుడు చివరగా ఎవరు పాయింట్స్ స్కోర్ చేసారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కారణంతో రితిక క్వాటర్స్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news