IPL 2024: ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌ లు..RTC అదిరిపోయే శుభవార్త

-

IPL 2024: ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర RTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య IPL మ్యాచ్ నేపథ్యంలో TSRTC ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటన చేశారు.

rtc good news for ipl lovers

క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 స్పెషల్ బ‌స్సుల‌ను న‌డుపుతోందని చెప్పారు. బుధవారం సాయంత్రం 6 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయని పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news