ఐపీఎల్‌-2024లో కొత్త రూల్స్ ఇవే..!

-

దేశంలో క్రికెట్ పండగకు వేళ అయింది. ఐపీఎల్ 17వ సీజన్‌ ఇవాళ (మార్చి 22,2024) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్  టైటిల్ కోసం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో, మరికొన్ని జట్లు కొత్త జెర్సీలతో పోటీకి వస్తున్నాయి. టీమ్స్‌లో ఆటగాళ్ల మార్పులు అదనం అనే చెప్పవచ్చు. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో కొన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి రానున్నాయి.

  • ఈ సారి ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లను అనుమతించనున్నారు. గత సీజన్ వరకు ఒక్క షార్ట్ బాల్ వేయడానికి మాత్రమే బౌలర్లకు అనుమతి ఉండేది. కానీ ఈ సారి గరిష్ఠంగా వాటిని రెండింటికి పెంచారు. ఈ నిబంధనను బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ప్రవేశపెట్టింది. ఈ రూల్ వల్ల బ్యాటు, బంతి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతుంది.
  • స్టంపింగ్ అపీల్‌లో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌ సలహాను కోరినప్పుడు ముందుగా క్యాచ్‌ను చెక్ చేసే రూల్ కొనసాగించనున్నారు. అయితే ఇది ఐసీసీ రూల్స్‌కు కాస్త భిన్నంగా ఉంది. మరోవైపు ఐసీసీ తీసుకువచ్చిన స్టాప్ క్లాక్‌ రూల్‌ను ఈ ఐపీఎల్ సీజన్‌లో అమలు చేయొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్టాప్ క్లాక్ నిబంధన ప్రకారం ఫీల్టింగ్ జట్టు 60 సెకన్ల లోపు తదుపరి ఓవర్ వేయాలి. అలా జరగని పక్షంలో ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు రెండు సార్లు హెచ్చరిస్తాడు. ఆ తర్వాత అయిదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు.
  • ఇక ఈ సీజన్‌లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ టెక్నాలజీ తీసుకురానున్నారు. దీని వల్ల టీవీ అంపైర్ నేరుగా హాక్ ఐ ఆపరేటర్స్ ద్వారా ఇన్‌పుట్స్ తీసుకుంటాడు. మైదానం చుట్టూ పెట్టే ఎనిమిది హైస్పీడ్ హాక్ ఐ కెమెరాల నుంచి బ్రాడ్ కాస్టర్ డైరెక్టర్‌తో సంబంధం లేకుండా రీప్లేలను టీవీ అంపైర్ పరిశీలించవచ్చు. దీంతో వేగంగా నిర్ణయాన్నివెల్లడించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news