రైతు బంధు పడిన వాళ్లు మాత్రమే నాకు ఓటు వేయండి – జీవన్ రెడ్డి

-

రైతు బంధు పడిన వాళ్లు మాత్రమే నాకు ఓటు వేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వ హాయాంలో చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. రాష్ట్రం దుబారా ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ మేరకు హామీ ఇచ్చారు.

ఇక నుంచి చెట్లు, పుట్టలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వమంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగు లకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు బీజేపీకి ఓటు వేయాలా లేదా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మన దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేసినందుకు ఆ పార్టీ ఓటు వేయాలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news