ఆ 8 మందిని చంపింది చంద్రబాబే – శ్రీరెడ్డి

-

కందుకూరులో ఆ 8 మందిని చంపింది చంద్రబాబేనని ఫైర్ అయ్యారు శ్రీరెడ్డి. అధికార దాహంతో ప్రజలను చంపేశాడని ఆగ్రహించారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షో సందర్భంగా తొక్కి సలాట చోటు చేసుకుని ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటన నేడు ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో 8 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబును ఏమనాలని మండి పడ్డారు శ్రీ రెడ్డి. చంద్రబాబు తన సభ సక్సెస్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలని.. ఇది రాజకీయ హత్య అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలు తీశాడని.. ఇప్పుడు 8 మంది ప్రాణాలను బలిగొన్నాడని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news