పుష్ప 2 లో శ్రీవల్లి 2.0ను చూస్తారు: రష్మిక మందన్న

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో రష్మిక మందాన కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప-2లో తన పాత్రపై హీరోయిన్ రష్మిక కీలక వ్యాఖ్యలు చేశారు. సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు.

సీక్వెల్లో తన పాత్ర మరింత బలంగా ఉంటుందని.. శ్రీవల్లి 2.0ని చూస్తారన్నారు. అయితే తన పాత్ర గురించి రివీల్ చేయలేనని అన్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన రష్మిక లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే… ఇటీవల హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ టీజర్ కి అయిన టీచర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news