విశాఖలో రికార్డింగ్ స్టూడియో పెడతా : తమన్ ప్రకటన

-

 

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గురించి ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు తమన్. ఈమధ్య బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు కూడా మ్యూజిక్ అందించి, మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విశాఖలో రికార్డింగ్ స్టూడియో నిర్మిస్తానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించారు. AU నూతనంగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో ను ప్రారంభించిన ఆయన, ‘నా విశ్రాంత జీవితాన్ని ప్రశాంత విశాఖనగరంలో గడిపేందుకు ఎంతో ఇష్టపడతాను. ఏపీ ని మ్యూజిక్ ల్యాండ్ గా భావిస్తున్నా. విశాఖ కేంద్రంగా సినీ సంగీత ప్రయాణానికి ఇదో మంచి ఆరంభం’ అని వెల్లడించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news