యాసంగి లో ప్రతి గింజా కొంటాం – హరీశ్ రావు

-

యాసంగి లో ప్రతి గింజా కొంటామన్నారు మంత్రి హరీశ్ రావు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ…రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులంటే కేసీఆర్ కు మక్కువ. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారు.

రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు, రైతు భీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. బీజేపీ వాళ్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేసి ఇస్తున్నారా. ? అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news