బిగ్ అనౌన్స్ మెంట్ : త్రివిక్రమ్-మహేష్ క్రేజీ అప్డేట్

-

ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హీరోయిన్ తో పాటు… సాంకేతిక బృందం వివరాలను ప్రకటించేసింది చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనుంది.

ఇక ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా, నవీన్ నూనె ఎడిటర్ గా, మది సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. అలాగే.. ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇక హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది సర్కారు వారి పాట.

Read more RELATED
Recommended to you

Latest news