జవాన్ చిత్రంలో స్టైలిష్ స్టార్.. నిజమేనా..!!

-

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప -2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అల్లు అర్జున్ గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. అదేమిటంటే బాలీవుడ్లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ పాత్రలో చేయబోతున్నారు అనే వార్త వైరాల్ గా మారుతోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార కూడా నటిస్తున్నది. కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారు.

అయితే చివరిలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ని సంప్రదించినట్లుగా డైరెక్టర్ అట్లి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ తో కలిసి కథ వినిపించి అందుకు సంబంధించి పాత్ర గురించి కూడా చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదు అన్నట్లుగా సమాచారం. పుష్ప చిత్రంతో నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్ ఏకంగా అక్కడ రూ .100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించారు.

కాబట్టి అల్లు అర్జున్ కనుక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పాత్రకు ఓకే చెబితే.. మలయాళం వంటి భాషలలో కూడా మార్కెట్ పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానులు అనుకున్నట్టుగా జవాన్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారేమో చూడాలి మరి. ఇక ఏడు సంవత్సరాలుగా హిట్టు లేని షారుఖ్ ఇటీవలే పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news