రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉంటా – సుచరిత

-

మాజీ హోం మంత్రి సుచరిత పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల కాలంలో బీభత్సంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు సుచరిత. రాజకీయాలలో ఉన్నంతకాలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, పార్టీ మారితే ఇంటికి పరిమితం అవుతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక తనకి అధిష్టానం ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఇంటిలిజెంట్ రిపోర్టు ఉంటుందని, ఫోన్ టాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాను రాజకీయాలలో ఉన్నత కాలం వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను బేస్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం తాను పార్టీ మరబోతున్నట్లు కథనాలను వెలువరిస్తుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news