ఈడీ ఎదుట హాజరైన MBS జువెల్లర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా

-

మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంబీఎస్ జువెల్లర్స్ అధినేత సుఖేశ్ గుప్తా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సుఖేశ్​ను అధికారులు విచారిస్తున్నారు. ఎంఎంటీసీ వద్ద రూ.225 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలో సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తును నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. సుఖేశ్ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈడీ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో సుఖేశ్ గుప్తా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news