హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం

-

హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ హార్లేకర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ 40 స్థానాలలో గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కసరత్తు చేసి సుఖ్వీందర్ సుఖూని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఈయనకి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సన్నిహితుడుగా మంచి గుర్తింపు ఉంది. ఎమ్మెల్యే లందరినీ సమన్వయం చేసుకొని వెళ్లాలని పార్టీ హైకమాండ్ సుక్విందర్ ను ఆదేశించింది. సామాజిక వర్గాలపరంగా మంత్రివర్గ విస్తరణను త్వరలోనే చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news