సీఎం కేసీఆర్‌ కు టాలీవుడ్‌ నటుడు సుమన్‌ పాదాభివందనం !

-

ఒక హిందువుగా సీఎం కేసీఆర్‌ కు పాదాభి వందనం చేస్తున్నాని సినీ నటుడు సుమన్‌ తెలిపారు. కేసీఆర్‌ ను ఏదైనా అనేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఆయన వల్లే తెలంగాణ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారు. శనివానం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్‌ గొంగొడి మహేందర్‌ రెడ్డి తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గురించి చెప్పాలి… మన హిందువులకు ఆయన ఇచ్చిన బహుమతి యాదాద్రి ఆలయమన్నారు. దాన్ని చూసి తరతరాలు గర్వపడతాయని… ఎంత డబ్బు అయినా.. సరే ఖర్చు పెట్టి ఆలయాన్ని దేశంలోనే ది బెస్ట్ గా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ఆయనది గొప్ప మనసని.. ఒక హిందువుగా కేసీఆర్‌ కు పాదాభివందనం చేస్తున్నాని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇతరులు ఇలా చాలా మంది పాల్గొన్నారని సుమన్‌ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news