జులైకే ఫిక్స్ అయిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌.. ఏ విష‌యంలో అంటే?

-

ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు ఇండస్ట్రీ లెక్కలు తారుమార‌వుతాయి. సినిమా ప్ర‌పంచం కొత్త డైలాగుల కోసం వెతుక్కుంటుంది. అలాంటి వ్య‌క్తి నుంచి సినిమా వ‌చ్చి దాదాపు ఏడాది దాటుతోంది. కానీ ఇంత వ‌ర‌కు ఎలంటి టీజ‌ర్ గానీ రాలేదు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ త‌న సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆయ‌నే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. ఇప్పుడు లేటెస్టుగా ఓ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా చేస్తున్న మూవీ సర్కారు వారి పాట. దీన్ని ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అయిన పరశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీపై ఓ రేంజ్ లో భారీగా అంచనాలు ఉన్నాయ‌నే చెప్పాలి. కానీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్తి చేసుకున్న టీమ్‌.. ఇప్ప‌టికే సెకండ్ షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసింది. అయితే దీనికి క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డింది.

ఇప్పుడు ప‌రిస్థితులు కొలిక్కి రావ‌డంతో రీ షెడ్యూల్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. టీమ్ ఎట్టి ప‌రిస్థితుల్లో జూలై నెలలోనే షెడ్యూల్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై షూట్ స్టార్ట్ కానుందట.ఈ రీ షూట్ లో సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో సహా ఇతర ప్రధాన నటులు పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి అనుకున్న టైమ్‌కు ఈ మూవీ వ‌స్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news