చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. కత్తి అందించి ఖతం చేసింది అశోక్ గజపతి : వైసీపీ ఎంపీ

-

అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేస్తూ మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే.. కత్తి అందించి ఖతం చేసింది అని అశోక్ గజపతి పై ఆరోపనలు చేశారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటిపేరు బాబుదైతే, రెండోది అశోక్ దేనని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ శాసన సభ్యత్వాన్నీ రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్ కు లేఖ రాసి ఆయనపై చెప్పులు కూడా విసిరాడని… అశోక్ గజపతిది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్త చరిత్ర అని మండిపడ్డారు.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

సతీ సహగమనం, వరకట్నం, బహు భార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీలకు ఆస్తిహక్కివ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోను లేదంటే చెల్లుతుందా అశోక్? అని ప్రశ్నించారు. పోలవరం కల సాకారానికి ఒక అడుగు దూరమే మిగిలిందని… సిఎం జగన్ గారి పట్టుదలతో రేయింబవళ్లు, లాక్ డౌన్ టైంలో కూడా నిర్మాణ పనులు కొనసాగడం వల్ల కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి రూపం సంతరించుకుంటుందని పేర్కొన్నారు. క్రెస్ట్ గేట్ల ద్వారా గోదావరి ప్రవాహం జాలు వారుతున్న దృశ్యం అద్భుతంగా ఉందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news