మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద… ఆ మహిళా ఎంపీ హల్చల్… ఎవరు ఆవిడ…? వాళ్ళను ఆలింగనం చేసుకుని పంపారు…!

-

ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార౦ చేయడానికి అసెంబ్లీ వద్దకు వచ్చారు… అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు… అసెంబ్లీ సెక్యురిటి వద్ద… ఒక మహిళ నిలబడి వారికి స్వాగతం చెప్తున్నారు… సభలోకి వస్తున్న కొంత మంది ఎమ్మెల్యేలను ఆమె హత్తుకున్నారు… వారిలో శివసేన యువనేత… ఎమ్మెల్యే ఆదిత్య థాకరే కూడా ఉన్నారు… వెంటనే అజిత్ పవార్ కూడా ఆయన వెంట వచ్చారు… ఆయనను కూడా హత్తుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కరచాలనం చేసి ఆయనను భుజం తట్టారు.

ఇంతకు ఎవరు ఆమె… అంత సన్నిహితంగా ఎందుకు మాట్లాడారు… ఆమె ఎవరో కాదు… మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, శరద్ పవార్ ముద్దుల కూతురు… సుప్రియ సదానంద్ సూలె… బారామతి ఎంపీ… మహారాష్ట్రలోనే కాదు దేశం మొత్తం ఆవిడ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్… ఆమె గురించి వార్తల్లో రాగానే తెలుసుకునే ప్రయత్నం చేసారు నెటిజన్లు… ట్విట్టర్ లో కూడా ఆమె ట్రెండ్ అయ్యారు… ఎన్సీపీతో శివసేన కలిసి వెళ్తుంది అనే సంకేతాలు ఆమె ముందు నుంచి ఇచ్చారు… ఆదిత్య థాకరేతో ఉన్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

రెండు రోజుల క్రితం… ఎమ్మెల్యేలను గ్రాండ్ హయత్ హోటల్ కి తీసుకువెళ్ళడంలో ఆమె తండ్రికి కుడి భుజంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. అందరితో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మా బలం 162 అంటూ ఆమె సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో అవసరమైన వ్యూహాలను తండ్రి చెప్పింది చెప్పినట్టు చేయడం, అజిత్ పవార్ తో మాట్లాడటం వంటివి ఆమె విజయవంతంగా చేసారు. ఇక అందరు ఎమ్మెల్యేలకు ఆమె స్వాగతం చెప్పడం ఒక ఎత్తు అయితే… దేవేంద్ర ఫడ్నవీస్ కి కూడా స్వాగతం చెప్పడం మరో ఎత్తు… ఇప్పుడు సోషల్ మీడియాలో సుప్రియ సెన్సేషన్… మీరు ఆమె ప్రొఫైల్ ని ఒక లుక్ వేసేయండి…

Read more RELATED
Recommended to you

Latest news