బ్రేకింగ్‌ : రెండో రాజధానిగా హైదరాబాద్… క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

-

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరో సారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే విశ్లేషణలు ఈ వాదనకి మరింత ఊతం ఇచ్చాయి.

అయితే కొద్దిరోజులకే సికింద్రాబాద్ ఎంపీ – కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇక ఈ రోజు ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news