రిషబ్ పంత్ ఇంట్లో సురేష్ రైనా, హర్భజన్, శ్రీశాంత్…

-

గతేడాది డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను మాజీ క్రికెటర్లు పరామర్శించారు. హర్భజన్ సింగ్, సురేష్ రైనా, శ్రీశాంత్ పంత్ ఇంటికి వెళ్లి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పంత్ వారితో సరదాగా గడిపాడు. కాగా, ఈ యంగ్ ప్లేయర్ పూర్తిగా కోలుకునేందుకు మరో 18-20 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాగా.. ఇటీవలే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్​ రిషభ్ పంత్​ను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కలిశాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్​ను యువరాజ్ పరామర్శించాడు. అతడితో కాసేపు ముచ్చటించాడు. ఈ విషయాన్ని యువరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చే శాడు. పంత్​తో దిగిన సెల్ఫీని షేర్ చేసుకున్నాడు.

https://twitter.com/ImTanujSingh/status/1639705805640581120?s=20

 

Read more RELATED
Recommended to you

Latest news