సురేష్ రైనా వీరాభిమాని మృతి.. రైనా ఎమోషనల్ ట్వీట్

-

భారత క్రికెట్ జట్టు ఆటగాడు సురేష్ రైనా గురించి పరిచయం అక్కర్లేదు. సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) లో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో రైనా పోషించిన పాత్ర ఏంటో మనందరికీ తెలిసిందే. అయితే సురేష్ రైనా వీరాభిమాని గురించి చాలామందికి తెలియకపోవచ్చు. రైనా ఆడుతున్న ప్రతిసారి విగ్నేష్ స్టాండ్స్ లో నిల్చని ఎంతో ఉత్సాహపరిచేవాడు.

తన వీపుపై రైనా పేరును రాసుకొని తన అభిమానాన్ని చాటుకునేవాడు. అతను రైనా పట్ల చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల అతని మరణ వార్త విని సురేష్ రైనా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ట్విట్టర్ వేదిక ద్వారా విగ్నేష్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశాడు. ” ఈ వార్త నన్ను షాక్ కి గురిచేసింది. విగ్నేష్ మరణ వార్త నన్ను కలచివేసింది. విగ్నేష్ ఎప్పటికీ నా మంచి అభిమాని. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి”. అంటూ రైన ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news