సుశాంత్, సారా థాయిలాండ్ ట్రిప్ నిజమే.. ఎందుకు వెళ్లారు..!

-

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్, హీరోయిన్​ సారా అలీఖాన్​ మధ్య ప్రేమాయణం ​నడిచినట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఈ నటుడి స్నేహితుడు శామ్యూల్​ మిరండా ఈ విషయాన్ని ఇటీవల చెప్పగా బీటౌన్​లో అలజడి రేగింది. తాజాగా ఈ విషయమై మాట్లాడాడు సుశాంత్ మాజీ అసిస్టెంట్​ సాబిర్​ అహ్మద్.గతంలో వీరిద్దరితో కలిసి ఓ ప్రైవేట్​ జెట్​లో థాయ్​లాండ్​ ట్రిప్​కు వెళ్లానని చెప్పాడు సాబిర్. మొత్తంగా ఆరుగురం కలిసి వెళ్లినట్లు తెలిపాడు. కాగా సుశాంత్, సారా బ్యాంకాక్​లోని ఓ విలాసవంతమైన హోటల్​లో బసచేసినట్లు వెల్లడించాడు. సందర్శనలో భాగంగా మిగితా వారు అక్కడే వేరే ప్రాంతాలను చూడటానికి వెళ్తే.. వీరు మాత్రం హోటల్​లోనే గడిపినట్లు పేర్కొన్నాడు. ఈ ట్రిప్​ కోసం సుశాంత్​ రూ.70లక్షల రూపాయలు ఖర్చు చేశాడని చెప్పాడు.

సుశాంత్​ డిప్రెషన్​కు గురయ్యే అవకాశం లేదని చెప్పాడు సాబిర్. అతనెప్పుడు అందరితో సంతోషంగా గడిపేవాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఈ హీరో ఓ డ్రగ్​ స్మగ్లర్​ వద్ద మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు వస్తోన్న వార్తలను ఖండించాడు. తాను రాజ్​పుత్ దగ్గర పని చేసినపుడు అతడు​ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశాడు.సుశాంత్​-సారా ‘కేదార్​నాథ్​’​ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి నడిచిందని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై వారిద్దరిలో ఎవరూ స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news