తొలి జాబితాలో చోటు దక్కించుకున్న సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్‌

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ తాజాగా లోక్ సభ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించింది.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.

ఈ లిస్ట్ లో బీజేపీ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే తెలిపారు. దీంతో బీజేపీలో కీలక నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ కూతురు అవకాశం కల్పించాలని చాలా రోజులుగా ఆ పార్టీ నేతలు సూచించగా, దానిని పరిగణనలోకి తీసుకున్న ఆ పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుష్మాస్వరాజ్ ఆత్మ సంతోషిస్తుంది అని బీజేపీ సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news