BREAKING : ప్రగతి భవన్ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం..!

-

ప్రగతి భవన్ ముందు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హత్య చేసుకున్న దంప‌తులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వారిగా గుర్తించారు. భార్య ,భర్త, ముగ్గురు పిల్లలు క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఎదుట ఆహ్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించారు. అయితే వారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి భూ వివాదమే కారణమ‌ని చెబుతున్నారు. తాము క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న 5ఎకరాల భూమి కబ్జా అయ్యిందని ఆరోపిస్తున్నారు.

pragathibhavan
pragathibhavan

ఎవరికి ఫిర్యాదు చేసినా త‌మ‌కు న్యాయం జరగడం లేదని అందువ‌ల్ఏ ఆవేదనతో ఆత్మహత్య యత్నం చేశామ‌ని చెబుతున్నారు. దంప‌తులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన సమయంలో అక్క‌డే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ప్ర‌మాదం తప్పింది. పోలీసులు దంప‌తుల స‌మ‌స్య‌ను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళామ‌ని చెప్ప‌డంతో ఆందోళ‌న స‌ద్దుమ‌నిగిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news