Taapse: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ మరోసారి వివాదాస్పద కామెంట్స్

-

సొట్టబుగ్గల సుందరి.. తాప్సీ పన్ను ‘ఝుమ్మంది నాదం’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అవేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం.. తగిన గుర్తింపు రాకపోవడం.. రొటీన్ స్టోరీలే తన వద్దకు రావడంతో తాప్సీ బాలీవుడ్​కు మకాం మార్చింది. అక్కడ డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. కంటెంట్ బేస్డ్ మూవీస్​తో అలరించింది. ప్రస్తుతం బీ టౌన్​లో తాప్సీ సూపర్ స్పీడ్​తో దూసుకెళ్తోంది. అయితే బాలీవుడ్​కు వెళ్లిన తర్వాత తాప్సీ చాలా సార్లు సౌత్ సినిమా ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి సౌత్‌పై సంచలన కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచింది తాప్సీ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదని చెప్పింది. నటిగా నిరూపించుకోవడానికి అవసరమైన పాత్రలు రాలేదని తెలిపింది. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగినప్పటికీ అక్కడ సంతృప్తి అనిపించిన క్యారెక్టర్స్‌ దొరకలేదని చెప్పింది. బాలీవుడ్‌లో నటించిన ‘పింక్‌’ తనకెంతో గుర్తింపు తెచ్చినట్లు తెలిపింది. ఆ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని చెప్పింది. దీంతో మరోసారి ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెటిజన్లు తాప్సీని ట్రోల్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news