ఎందరో మహనీయుల తాగ్యాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించింది : మంత్రి తలసాని

-

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సారి స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వత్రంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా .. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎందరో మహనీయుల తాగ్యాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.

Image

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన గురించి విద్యార్థులకు తెలియజెప్పేందుకు గాంధీ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అలాగే 75 ప్రాంతాల్లో ఫ్రీడమ్‌ పార్కులను ఏర్పాటు చేసి, మొక్కలు నాటుతున్న పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news