మద్యం కోసం లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకుడు : పోలీసుల దాడిలో మృతి

-

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది.
లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం కోసం ఓ జిల్లా నుండి మరో జిల్లా వెళుతున్న యువకుడ్ని దారుణంగా కొట్టారు పోలీసులు. దీంతో ఊపిరి ఆడక మృతి చెందాడు మురుగేషన్ అనే వ్యక్తి. అసలు వివరాల్లోకి వెళితే….మద్యం కోసం సేలం జిల్లా నుండి ధర్మాపూరి జిల్లాకు వెళ్ళాడు మురుగేషన్. అయితే మద్యం తాగి వస్తున్న మురుగేషన్ ను ఎడప్పాడి చెక్ పోస్ట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు మురుగేసన్.

crime

ఈ నేపథ్యంలో లో కోపంతో కిందపడేసి యువకుడ్ని చితక బాదారు పోలీసులు. అయితే ఈ దాడిలో మురుగేషన్ మృతి చెందాడు. దీంతో సీరియస్ అయిన అధికారులు దాడి చేసిన ముగ్గురు పోలీసులను సస్సెండ్ చేసారు. అయితే తే.గీ మురుగేషన్ పై పోలీసులు దాడి చేసిన ఘటన కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు అవుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news